అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు
ఎంసీపిఐ( యు )రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి.
ఎర్ర వనంగా మారిన మాదన్నపేట అమరవీరుల సంస్మరణ సభ
ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కవి గాయకుడు యోచన కళాబృందం ఆటపాటలు
నర్సంపేట,నేటిధాత్రి:
అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయసిద్ధికై దోపిడి వర్గ నిర్మూలన కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఎంసీపిఐ( యు ) అమరవీరుల సంస్మరణ బహిరంగ సభను గ్రామ పార్టీ కార్యదర్శి అనుమల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ముందుగా అమరవీరుల స్మారకార్థం నిర్మించిన స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఆనాడు కామ్రేడ్ ఓంకార్ నాయకత్వంలో వరంగల్ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించబడ్డాయని,ప్రజా పోరాటాలను చూసి ఓర్వలేని దోపిడివర్గ పాలకులు ప్రజా ఉద్యమాలపై కక్షకట్టి ఆణిముత్యాలాంటి నాయకులను హత్యచేశారని ఆరోపించారు.వారు భౌతికంగా దూరమైనా వారి ఆశయాలు త్యాగాలు వృధా కాకుండా

చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయని ఎన్నో ఆశలు,ఆకాంక్షలతో కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తే నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు .అమరవీరులు చూపిన బాటలో ప్రజా సమస్యలపై సమర శీల పోరాటాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.సభలో ప్రముఖ కవి,గాయకులు యోచన కళాబృందం,ఐక్య ప్రజానాట్యమండలి కళాబృందం నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కాగా మాదన్నపేట గ్రామం మొత్తం జెండాలతో ఎర్రవంగా మారింది.ఈ సభలో పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ , ప్రముఖ కవి గాయకులు ,యో చన , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి ,ఎన్ రెడ్డి హంస రెడ్డి ,మంద రవి ,కన్న వెంకన్న ,మాస్ సావిత్రి , గడ్డం నాగార్జున , ఎండి రాజా సాహెబ్ , కొత్తకొండ రాజమౌళి ,కనకం సంధ్య ,కేశెట్టి సదానందం ,ఎండి మా షూక్ ,ఎల్లబోయిన రాజు ,కల కోట్ల యాదగిరి ,మార్త నాగరాజు ,సుధా , కర్నె సాంబయ్య ,గుర్రం రవి , ఆకుల రాజేందర్ ,వక్కల రాజమౌళి ,కొప్పుల సమ్మక్క ,వైనాల పద్మ ,కేశెట్టి శ్రీను , అల్లం నరసయ్య ,అమరవీరుల కుటుంబ సభ్యులు ,ప్రముఖ కళాకారులు తాళ్ల సునీల్ , గాదెపాక బాబు ,బరిగల రవీందర్ ,రావుల శంకర్ ,అనిల్ కర్ణ ,నరసింహ ,సింగన బోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు.