యాసంగీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు.
నాగర్ కర్నూల్/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. సన్నరకం వడ్లకు క్వింటాకు రూ.
500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆదివారం నాగర్ కర్నూల్ నియోజికవర్గంలో కురిసిన అకాల వర్షంతో పంటలు నేలకొరిగిన పంటలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అంచన వేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.