కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం.
మరిపెడ నేటిధాత్రి.
మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం లో కన్నుల పండుగగా రాముల వారి కళ్యాణం ఆదివారం జరిగింది. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల బంధం అజరామరమైనది.లోక కళ్యాణం కారకం సీతారాముల కళ్యాణం. జన్మ పరంగా వచ్చే మలిన ఖర్మలు ఈ సందర్బంగా తొలిగిపోయే అవకాశం ఉంటుందనే భక్తుల్లో నమ్మకం, ఈ కళ్యాణ మహోత్సవం లో రామ సహాయం నరసింహారెడ్డి, మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో, మరియు గ్రామ ప్రజల అందరి సహకారంతో సీతారాముల కళ్యాణ మహోత్సవం తో పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, వేద పండితులు శ్రీనివాస్ గీత దంపతులు రాముల వారి కల్యాణం నిర్వహించారు, భక్తి మార్గంలో నడిచే సీతా రాముల ఆశీర్వాదాంతో ప్రతి ఇంటిలో రాముడి ఆశీర్వాదాంతో శాంతి,సౌభాగ్యం కలగాలని,సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ సహాయం విష్ణువర్ధన్ రెడ్డి,జైపాల్ రెడ్డి, రాంపల్లి వెంకన్న,కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ రాంపల్లి వీరాంజి గౌడ్,లాయర్ రఘురామ్ రెడ్డి,పెండ్లి లింగరెడ్డి,వంగ పెద్ద వెంకన్న, ఈరాగాని శ్రీను,రాముల వారి కమిటీ సభ్యులు ఏల్ది చిన్న మల్లయ్య,అన్నం సత్యనారాయణ, ఊరుకొండ వెంకన్న,సత్య శ్రీనివాస్, ఈరాగాని రమేష్,ఎల్ది సాయి,వంశీ, సుధగాని డాక్టర్ నవీన్, ప్రవీణ్, దోమల విష్ణు గౌడ్,మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.