అక్రమ అరెస్టులను సహించేది లేదు బిఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి.
గంగాధర నేటిధాత్రి :
ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది, ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇలాంటి అరెస్టుల వాళ్ళ ప్రతిపక్షాల గొంతు నొక్కడం తప్ప వేరే ఏమీ లేదు అన్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడుగుతే అక్రమ అరెస్టుల అని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో జారీ చేసిన సర్కులర్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాల రాస్తున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు త్వరలో బుద్ధి చెప్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
మధుసూదన్ రెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు సాయిల్ల సంతోష్ అరెస్టయ్యారు