శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ శివారులోని శాంతిఖని గని ఆవరణలో తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆధ్వర్యం లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎక్స్ టెన్షన్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో శాంతిఖని లాంగ్ వాల్ ప్రాజెక్టు గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాల ప్రజలను వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపకుండా వందలాది పోలీసులు సింగరేణి ఎస్ ఎన్ పి సి. సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. కావున ప్రభావిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని ప్రభావిత గ్రామాలైన బట్వాన్ పల్లి, పెర్కపల్లి, ఆకెనపల్లి, లింగపూర్, తాళ్ల గురిజాల గ్రామాలలో గ్రామాల వారీగా మళ్లీ నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో వినతిపత్రం అందచేసిన ప్రభావిత గ్రామాల రైతులు,ప్రజలు.సింగతి కిరణ్ కుమార్ కందుల రాకేష్ కుమార్.ఆకిరెడ్డి శంకర్.కందుల శంకరయ్య.గోమాస శ్రీనివాస్ మాజీ ఎంపీపీ. తొంగల మల్లేష్ మాజీ ఎంపీపీ.సింగతి నరేందర్
. గోమాస వినోద్ కుమార్. అచ్చె శివ తదితరులు పాల్గొన్నారు.