ఐటీడీఏ పరిధి లోని స్కూల్స్ వసతి గృహాల సామాగ్రి సరఫరాకు సీల్డ్ టెండర్లుకు ఆహ్వానం
ఐటీడీఏ పీవో బి . రాహుల్ ఐఏఎస్
నేటి ధాత్రి భద్రాచలం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు మరియు వసతి గృహాలకు కావలసిన డ్యూయల్ డెస్క్ బల్లలు, గ్రీన్ బోర్డ్స్ స్టీల్ వంట సామాగ్రి సరఫరా నిమిత్తం సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇట్టి టెండర్ నందు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా మరియు అన్ని అర్హతలు కలిగిన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వారు పాల్గొనవచ్చునని ఆయన అన్నారు.
కావున ఆసక్తిగల టెండర్ దారులు ఉపసంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి తేదీ 06-03-25 నుండి 10-03-25, మధ్యాహ్నం ఒంటిగంట వరకు టెండర్ షెడ్యూల్స్ పొందవచ్చునని, టెండర్ షెడ్యూల్ ధర రూ.3000/-ఉప సంచాలకులు (గి. సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం గారి పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించి పొందవచ్చునని, ధరావత్ సొమ్ము రూ.3,00,000/-డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో టెండర్ షెడ్యూల్ తో పాటుగా టెండర్ బాక్స్ నందు సమర్పించాలని ఆయన అన్నారు.
పూర్తి చేసిన టెండర్ షెడ్యూల్ ఆఖరి తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటల లోపు ఉపసంచాలకులు, (గి. సం.) శాఖ, ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం టెండర్ బాక్స్ నందు సమర్పించాలని, తేదీ 10-03-25 సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం సమావేశ మందిరంలో హాజరైన టెండర్లదారుల సమక్షంలో తెరిచి తుది నిర్ణయం తీసుకోబడునని, టెండర్ దారులు శాంపిల్స్ తీసుకొని రావాలని, సెలవు దినములలో కూడా ఆఫీసు తెరిచి ఉంచబడునని, కావలసినవారు దరఖాస్తులను పొందవచ్చునని ఆయన అన్నారు.