ఇందిరమ్మ ఇల్లు నమూనా ప్రారంభం

కొత్తగూడ, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లను ప్రజలపాలనలో భాగంగా ప్రతి పేదవాడికి సొంతంటీ ని నిర్మిస్తామని అనే నినాదంతో ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా ప్రజా పాలన సాగిస్తుంది.. అందులో భాగంగా. శుక్రవారం రోజు కొత్తగూడ మండలం కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో హౌసింగ్ AE లు జగదీశ్. లాలసాబ్ మండల అధికారుల కలిసి ఇందిరమ్మ ఇల్లు నమూనా కు ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య పాల్గొని మాట్లాడుతు పేద ప్రజలు ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన ఇందిరమ్మ ఇండ్లు త్వరలో గ్రామ గ్రామన ప్రారంభం జరుగుతుందని.. అని అన్నారు…
ఈ కార్యక్రమం లో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్ల నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ సెక్రటరీ నోముల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!