నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట డివిజన్ పరిధిలోని టీఎన్జీఓ నాయకులు ఆర్డిఓ ఉమారాణిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆర్డీఓ ఉమారాణి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో టీఎన్జీఓ ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రజల మెప్పుపొంది ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యకులు కడారి సురేష్ రెడ్డి, కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రేటరీ లక్ష్మణ్,యాకుబ్ పాషా, పబ్లిక్ సెక్రటరీ కుసుమ శివ, ఈసి మెంబర్ మీనా,అరుణ, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.