రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం హైదరాబాద్ నుండి రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రతా ప్రమాణాలు, మాసో త్సవాలు నిర్వహణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు. రోడ్డు భద్రత, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నెల మొత్తం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్టిఓ సంధాని, వైద్యాదికారి డాక్టర్ మధుసూదన్, డీఈఓ రాజేందర్,
పీఆర్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!