ఇండ్ల సర్వేలో నిరుపేదల పేర్లు ఆన్ లైన్ లో గల్లంతు

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలంలోని గ్రామాలలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదల పేర్లు ఆల్ లైన్ లో చూపెట్టడం లేదు పంచాయతీ కార్యదర్శులు ఇంటింటి సర్వలో భాగంగా కొంతమంది పేర్లు కనబడటం లేదు మళ్లీ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు వచ్చి సర్వే నిర్వహిస్తామని చెప్తున్నారు అసలైన నిరుపేదల పేర్లు ఆన్ లైన్ లో కనపడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మా పేర్లు ఎందుకు కనబడవు మేము కూడా దరఖాస్తు చేసుకున్నాము అని చెప్తున్నారు ఇలాంటి మిస్టిక్ జరగడానికి అధికారులు కారణమని ఆరోపిస్తున్నాం డబుల్ బెడ్ రూములు ఇల్లు లేని నిరుపేదలకు అందే విధంగా సర్వే నిర్వహిస్తుంది ప్రభుత్వం కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అసలైన లబ్ధిదారుల పేర్లు ఆన్ లైన్ లో కనబడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు తక్షణమే నిరుపేదల ఇండ్లను సర్వే నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నీ డిమాండ్ చేస్తా ఉన్నాం .. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చే విధంగా అసలైన నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే ఎవరికైతే ఆన్ లైన్ లో పేర్లు లేవు వాళ్ల అందరి పేర్లు ఎక్కించి సర్వే నిర్వహించాలని అన్నారు లేకపోతే వాళ్ళందరినీ సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి అన్నారు సంగీ రాజు జీడి రాజు బండారి రాజయ్య పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!