త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ఎస్సై దిలీప్

కొత్తగూడ, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లో మజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్ ఆధ్వర్యంలో ఘనంగా బక్రీద్ వేడుకలు వేడుకను శాంతి యుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందో బస్తూ ఏర్పాటు త్యాగానికి ప్రతీకగా నిలిచే పండుగ బక్రీద్‌ అని ఎస్సై దిలీప్ అన్నారు. సోమవారం బక్రీద్ పర్వదినం సందర్బంగా మజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్ ఆధ్వర్యంలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వాహంచారు ఈ వేడుకలో ఎస్సై దిలీప్ ముఖ్య అతిగా పాల్గొని ఎస్సై దిలీప్ మాట్లాడుతూ…ముందుగా ముస్లీమ్ సోదరులందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెల్పి భక్తిభావం,విశ్వాసం,కరుణ,ఐక్యతకు సంకేతం అని ప్రతి ఒక్కరూ సన్మార్గం లో జీవించాలనే సందేశాన్ని బక్రీద్‌ చాటుతుందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎప్పుడూ ఉండాలని అన్ని గుణాల కంటే దానగుణమే ఉత్తమమన్నది పండుగ సారాంశం అంటూ పవిత్రమైన రంజాన్‌ తరువాత రెండో అతిపెద్ద పండుగ బక్రీద్‌ అని పేర్కొన్నారు.ఈ వేడుకను శాంతి యుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందో బస్తూ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో యాకుబ్ పాషా, అక్రమ్,పాషా,గౌస్,ఖాజా, దస్తగిరి,రాజ్జఫ్, సల్మాన్,సద్దాం, ఇమ్రాన్,అన్వర్, మహబూబ్ అలీ, సయ్యద్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!