కేవీపీ నీ మర్యాదపూర్వకంగా కలిసిన పొదెం

భద్రాచలం నేటి ధాత్రి

సీనియర్ కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ముఖ్య సలహాదారులు కెవిపి రామచంద్ర రావు భద్రాచలం వచ్చిన సందర్భంగా శనివారం ఉదయం ఏఐసీసీ మెంబర్, టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య మర్యాదపూర్వకంగా వారిని కలిసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి గత వైభవాలు గురించి కాసేపు ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాలా రవికుమార్ , కాంగ్రెస్ పార్టీ భద్రాచలం మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు , సీనియర్ నాయకులు రౌతు నరసింహారావు , చింతిరాల సుధీర్ కుమార్ ,వరుణ్ వాసిరెడ్డి సాంబశివరావు , సుంకర శేషు చర్ల కాంగ్రెస్ నాయకులు చీమలమర్రి మురళి తడికల లాలయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!