నస్పూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
విద్యార్థి దశలో అతి ముఖ్యమైన ఘట్టమైనటువంటి ఎస్ఎస్ సి బోర్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రోజున వెలువడిన పదవ తరగతి ఫలితాలలో సిసిసి నస్పూర్ లోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.పట్టణ పరిధిలోని రేడియంట్ హై స్కూల్ విద్యార్థులు జక్కుల అక్షయ గౌడ్, గుమ్మడి మాధురి, ముత్యాల అక్షిత రెడ్డి, 10/10 జిపిఏ సాధించి మొదటి స్థానంలో నిలిచారు వారిని పాఠశాల కరస్పాండెంట్ చెన్నూరి అఖిల, ప్రిన్సిపాల్ రజని,రెయిన్ బో ప్లే స్కూల్ కరస్పాండెంట్ అమన్
ప్రసాద్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాము,అమీన్, రవీందర్,సరస్వతి,జగన్, పిటి టీచర్ శ్యామ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.