డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులతో సమావేశమై 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ఎన్నికలు కాబట్టి మన అభ్యర్థులను మెజార్టీ తో గెలిపించుకోవాలి అందరూ కలిసికట్టుగా నిబంధతతో పని చేయాలి. కష్టపడ్డ వాళ్లకి తగిన గుర్తింపు లభిస్తుంది.
కేంద్రంలో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న , జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ , కిసాన్ సిల్ జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు , ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ , బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.