గొల్లపల్లి నేటి ధాత్రి:
ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా సోమవారం క్యాంప్ కార్యాలయంలో వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమ సంతోష్, తాజా మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్, రేవెల్ల సత్యనారాయణ గౌడ్, పురం శెట్టి పద్మ వెంకటేశం, సరసాని రాజ్యలక్ష్మి తిరుపతిరెడ్డి, గొల్లపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేరెళ్ల మహేష్, రాజేశ్వర్ రావు, రేవెల్ల లింగయ్య, సంగెం తిరుపతి, ఓర్సు విజయ్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.