వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు.

అధికారుల నిర్లక్ష్యం
పట్టించుకోని కాంట్రాక్టర్లు
అక్షర విజేత జడ్చర్ల.

రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం వేలకోట్లు రూపాయాలను వెచ్చించింది. ప్రజలకోసం ఇంత ఖర్చు చేసిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృధాగా మారుతుంది.రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడుతున్న త్రాగు నీటి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ను ప్రారంబించింది దిని ద్వారా ప్రతి ఇంటి కి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని అమలు పరుస్తోంది కానీ ప్రస్తుతం పైప్ లైన్ పలిగి నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే వారే లేరు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటి కి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని ప్రవేశ పెడితే అధికారుల అండతో కాంట్రాక్టర్స్ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కరని ప్రజలు గుస గుస లాడుతున్నాయి వివరాల్లోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్ గండ్ల గ్రామం లో అధికార యంత్రాంగం నిత్యం మెలిగే రహదారి పక్కనే నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. గత ఆరు నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పలిగీ నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండ డంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించి నీటి ఎందడి లేకుండా చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతి మీటింగ్ లో చెబుతున్న కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక దిక్కు నీరు లేక ప్రజలు విలవిలలాడుతూ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు పైప్ లైన్ పలిగి ఇన్ని రోజులైనా సంబంధిత అధికారులు గాని కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతుందని, ఇదంతా అధికారుల కనుసైగ లోనే జరుగుతుందని లేకపోతే ఇప్పటికే కాంట్రాక్టర్ పైపులైను మరమ్మతులు చేసి నీరు అందించే వారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మిషన్ భగీరథ వాటర్ వదిలినప్పుడు పైప్ లైన్ లీకై వృధాగా పంట పొలంలోకి వెళ్తున్నాయి. నీటిని వదలకుండా ఉన్నప్పుడు గుంతలో నిండిన మురుగునీరు మళ్లీ పైప్ లైన్ లోకి రిటర్న్ వెళ్లి పోతున్నాయి మురుగు నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్య త్వరలోనే పూర్తి చేసి మంచినీటిని అందించాలని ప్రజలు ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!