మరిపెడకు చేరుకున్న బిజెపి సంకల్పయాత్ర

* భారీగా తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు

* వచ్చేది మళ్లీ బిజెపి ప్రభుత్వమే

* మాజీమంత్రి విజయ రామారావు

మరిపెడ నేటి ధాత్రి.

విజయ సంకల్ప యాత్ర గురు వారానికి మరిపెడ మండలంకు చేరుకున్న బిజెపి విజయసంకల్పయాత్ర మహబూబాబాద్ క్రాస్ రోడ్డు నుండి వరంగల్ రోడ్డు పెట్రోల్ బంక్ వరకు ర్యాలీతో తరలివచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించారు‌‌. బిజెపి మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వంలో అసాధ్యం సుసాధ్యం చేసిన మోడీ 500 ఏళ్ల అయోధ్య రామ మందిరం స్వప్నం సహకారం బిజెపి ప్రభుత్వంలో జరిగిందన్నారు. తెలంగాణకు మోడీ వరాలు కురిపించారన్నారు. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు మోడీ ప్రభుత్వంలో జరిగిందన్నారు అనంతరం ధర్మారావు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందేనని ఎద్దే వచ్చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కానీ ప్రజల కష్టం మాత్రం తొలగి పోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అనేక విధాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పథకాలు కొనసాగిస్తుంది. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీ లపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలు పక్కతోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ మోసాలు ఎవరు నమ్మొద్దు 500 కే గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమీలు ముందుకు కదలడం లేదు అన్నారు. రైతులకు ఎకరాకు 15000 రైతు భరోసా అధికారంలోకి వచ్చాక వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. 24 గంటలు కరెంటు ఇస్తానని చెప్పి కరెంటు కోతలు ప్రజలను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో గుజ్జల ఉపేందర్ రెడ్డి వై వి. రావు, శ్రీనివాస్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి , బి బీరప్ప, రాజ వర్ధన్ రెడ్డి, సీతయ్య, ప్రభాకర్ రెడ్డి, గాదె రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకన్న, పట్టణ అధ్యక్షులు లింగన్న , బింగి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!