చోప్పదండి, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామ మల్లన్నపల్లికి చెందిన దుర్గం పూజ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారియొక్క కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న చోప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సతీమణి సుంకే దీవెన కుటుంబ సభ్యులకు యాభై కిలోల బియ్యం అందించడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు జాడి లస్మయ్య, సింగల్ విండో డైరెక్టర్ దుర్గం పద్మ, బిఆర్ఎస్వై చొప్పదండి నియోజకవర్గం ఉపాధ్యక్షులు భక్తు విజయ్ కుమార్, బిఆర్ఎస్వై చొప్పదండి మండల ప్రధాన కార్యదర్శి బండారి సంపత్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భక్తు తిరుపతి, భక్తు లక్ష్మయ్య, భక్తు సాగర్, బండారి మల్లయ్య, భక్తు లచ్చయ్య,భక్తు శంకర్ నారాయణ, గోళ్ళే రాజ్యలక్ష్మి, పైడి మధునమ్మ, తదితరులు పాల్గొన్నారు.