లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: అక్టోబర్ 12:-
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు లక్షెటిపేట మహాత్మ జ్యోతిబాపూలే కళాశాల విద్యార్థులు శివ, అజయ్ లు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 19 కబడ్డీ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 17,18,19 తేదీలో సంగారెడ్డి లో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారాని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను ఏటీపీ సునీత,పీడీ రాజేష్, పి ఈ టి కార్తీక్, ఉపాధ్యాయులు అభిందించారు.