వైద్య కళాశాల శంకుస్థాపన పనులను పరిశీలించిన కలెక్టర్

# జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులు,గణేష్ నిమజ్జనం దామెర చెరువు ప్రాంతం,వ్యవసాయ మార్కెట్ యార్డులలో పర్యటన,

నర్సంపేట,నేటిధాత్రి :

వైద్య ఆరోగ్య,వైద్య విద్య రంగాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేపథ్యంలో నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంజూరి చేసింది.స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో నేడు ఆ కళాశాల శంకుస్థాపన పనులు చేపట్టనున్నారు.ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్న నేపథ్యంలో బుదవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి సమీప శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు.అలాగే జిల్లా ఆసుపత్రి,గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా చేస్తున్న వినాయక విమజ్జన ప్రాంతం దామెర చెరువును సందర్శించారు.అలాగే భారీగా జరిగే భహిరంగ సభ వ్యవసాయ మార్కెట్ యార్డును జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న తో కలిసి పరిశీలించారు.ఏర్పాట్ల పట్ల సందర్శించి పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వినాయక నిమజ్జనం సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.భక్తి శ్రద్ధలతో చేపట్టాల్సిన కార్యక్రమంలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఏసిపి తిరుమల్ రావుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమాలలో నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీ కిషన్,సీఐ రవి కుమార్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాష్,సివిల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ గోపాల్,పలువురు అధికారులు,కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!