నర్సంపేట,నేటిధాత్రి :
స్వతంత్ర సమరయోధుడు పెండెం కటయ్య కుమారుడు, నర్సంపేట ఎస్ టి వి ఫౌండర్,జర్నలిస్టు పెండెం శివానంద్ తండ్రి పెండెం ఆనంద్ అనారోగ్యంతో గురువారం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో మృతి చెందాడు.కాగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిమ్స్ ఆసుపత్రిలో ఆనంద్ మృతదేహం వద్ద పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు.కుమారుడు జర్నలిస్టు శివానంద్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెండెం కట్టయ్య కుటుంబం రాజకీయాలలో, ప్రజాసేవలో ప్రజలకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.