అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ రవిచంద్ర

ఇరుముడి కార్యక్రమానికి హాజరు

ఖమ్మం, డిసెంబర్, 8:

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం శ్రీనివాస నగర్ లోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఎంపీ హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన రవిచంద్రకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనను

శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దివ్య మణికంఠ అయ్యప్ప భక్త బృందం సభ్యుల ఇరుముడి కార్యక్రమానికి హాజరయ్యారు. అయ్యప్ప సన్నిధానం శబరిమలై బయలుదేరడానికి ఇరుముడి ధరించిన స్వాములు, కుటుంబ సభ్యులకు ఎంపీ 

శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర సుఖప్రదం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు రాయపూడి వెంకటరమణ, కాకరపర్తి రమేష్, తూములూరి అప్పారావు, మేళ్లచెర్వు మనోజ్, దివ్య మణికంఠ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!