డబ్బు, బంగారంతో ఉడాయించిన కిలాడీ దంపతుల అరెస్ట్

అవసరాల కోసమని కాలనీవాసులను మోసం చేసి వారి నుండి డబ్బులు, బంగారాన్ని తీసుకోని వాటితో ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్ ఫోర్స్ మరియు కేయూసి పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.*

*వీరినుండి పోలీసులు సుమారు 11లక్షల80 వేల రూపాయలతో పాటు 125 గ్రాముల బంగారు అభరణాలు, ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.*

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన దంపతులు కొమళ్ళ కిషోర్, కొమళ్ళ దివ్య హన్మకొండ లోని పరిమళకాలనీలో నివాసం వుంటూ చిరు వ్యాపారం నిర్వహిస్తుండేవారు. ఈ వ్యాపారంలో వారికి లాభాలు రాకపోవడంతో సులభంగా పెద్ద

మొత్తం డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందుకోసం ఈ కిలాడీ దంపతులు తాము నివాసం వుంటున్న కాలనీవాసులతో స్నేహపూర్వకంగా వుండేవారు. ఈ దంపతలు తమ ప్రణాళికలో భాగంగా ముందుగా కాలనీవాసుల వద్ద తమ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ముందుగా చిన్న మొత్తాల్లో అప్పుగా డబ్బు లేదా బంగారాన్ని తీసుకోని ప్రతి ఫలంగా వారికి తీసుకున్న డబ్బుకు పెద్దమొత్తంలో వడ్డీ చెల్లించేవారు. దీనితో దంవతలు తాము తీసుకున్న డబ్బుకు రెండింతలు డబ్బు తిరిగి అందజేసి కాలనీవాసులను నమ్మించడం ప్రారంభించారు. కాలనీవాసులకు వీరిపై నమ్మకాన్ని కలిగించేవిధంగా ఈ దంపతలు వ్యవహరించారు. తాము అనుకున్న ప్రకారం తమ ప్రణాళిక చివరి అంకాన్ని రావడంతో కిలాడీ దంపతులు కాలనీ వాసుల నుండి పెద్ద మొత్తంలో డబ్బు, బంగారాన్ని తీసుకోనేందుకుగా ప్రణాళికను రచన చేసారు. ఇందులో భాగంగా నిందితురాలు కొమళ్ళ దివ్యా తనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయుంచుకోవాలని లేదంటే తన ప్రాణానికే ప్రమాదమని కాలనీలోని మహిళలను నమ్మించడంతో పాటు తన చికిత్స కోసం డబ్బు లేదా బంగారాన్ని రుణం ఇచ్చేవారికి అధిక వడ్డీని అందజేస్తాని తెలియజేసి కాలనీలోని ఆరుగురు మహిళలను నుండి సుమారు 43 లక్షల 40వేల రూపాయలతో పాటు 430 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకోని కిలాడీ దంపతులిద్దారు ఒకాను శుభ ముహుర్తంలో కాలనీ నుండి ఉడాయించారు. దీనితో డబ్బు, బంగారు రుణంగా ఇచ్చిన బాధితులు ఈ దంపతులిద్దరు కాలనీకి రాకపోవడంతో పాటు వారి ఫోన్ కుడా స్వీస్ఆఫ్ కావడంతో తాము మోసపోయామని గుర్తించారు.

కమిషనర్ ఆదేశాల మేరకు నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడంతో పాటు పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫ ర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో టాస్క్ఫ ర్స్ మరియు కేయూసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వద్దవున్న టెక్నాలజీని వినియోగించుకోని కిలాడీ దంపతలను గుర్తించడంతో పాటు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దంపతలిద్దరు కాలనీవాసులను

మోసం చేసినట్లుగా అంగీకరించారు. అదే విధంగా ఈ దంపతలకు సహకరించిన మరో ఇద్దరు మహిళలైన అరుణ,మంజుల ఇరువురు ప్రస్తుతం పరారీలో వున్నారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ప్రజల సొమ్ముతో ఉదయించిన దంపతులిద్దరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచడం ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు సంతోష్, శ్రీనివాస్, కెయూసి ఇన్స్ స్పెక్టర్ దయాకర్, టాస్క్ ఫోర్స్, కేయూసి ఎస్. ఐలు లవణ కుమార్, సంపత్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్లు సోమలింగం,మాధవరెడ్డి, స్వర్ణలత,

కానిస్టేబుళ్ళు రాజేష్, ఆలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్ మరియు హోంగార్డ్ విజయ్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!