BRS-BJP Equation Collapses
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు “సీక్రెట్ ఫ్రెండ్షిప్” అంటూ నడిచిన గుసగుసలకు…
ఒక్క కేసు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అవును…
బండి భగీరథ్ పోక్సో కేసు ఇప్పుడు కేవలం లీగల్ కాంట్రవర్సీ కాదు…
తెలంగాణ రాజకీయాల “పవర్ మ్యాప్”నే మార్చేసిన టర్నింగ్ పాయింట్గా మారింది.
ఇప్పటివరకు “కాంగ్రెస్ను ఆపాలంటే… భవిష్యత్తులో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఎక్కడో ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ కుదురిందన్న ప్రచారం సారింగి.
ఎందుకంటే…
కేసీఆర్, కేటీఆర్ బీజేపీపై దాడి చేసినా…
ఫోకస్ ఎక్కువగా రాష్ట్ర నేతలపైనే ఉండేది.
ఢిల్లీ లీడర్షిప్పై పూర్తి స్థాయి వార్ మాత్రం కనిపించేది కాదు.
అక్కడే రాజకీయ కారిడార్లలో ఒక థియరీ వైరల్ అయింది.
“బయటకు ఫైట్… లోపల సెటిల్మెంట్…” అని.
కానీ…
బండి భగీరథ్ కేసు తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.
ఈసారి బీఆర్ఎస్ కేవలం స్పందించలేదు…
పూర్తి స్థాయి పొలిటికల్ అటాక్ మోడ్లోకి వెళ్లిపోయింది.
కేటీఆర్ నేరుగా బండి సంజయ్ మంత్రి పదవినే టార్గెట్ చేయడం…
గులాబీ కేడర్ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ నిరసనలకు దిగడం…
బీజేపీకి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది.
“ఇక్కడ పొత్తుల పాలిటిక్స్ కాదు… పవర్ వార్ మొదలైంది” అని.
ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్గెస్ట్ షిఫ్ట్గా మారింది.
ఎందుకంటే…
ఇప్పటివరకు బీజేపీ బీఆర్ఎస్పై చూపించిన మెత్తటి వైఖరి…
ఇక కనిపించకపోవచ్చనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ విక్టరీ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్న కమలం…
ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు బీజేపీ లెక్క ఒక్కటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
“కాంగ్రెస్ను ఓడించాలంటే ముందు బీఆర్ఎస్ను వీక్ చేయాలి.”
ఎందుకంటే…
గ్రామ స్థాయిలో ఇంకా బలమైన కేడర్…
ఎమోషనల్ కనెక్ట్…
స్థిరమైన ఓటు బ్యాంక్…
ఇవన్నీ ఇప్పటికీ గులాబీ పార్టీ దగ్గరే ఉన్నాయి.
అందుకే ఇప్పుడు అసలు టార్గెట్ కాంగ్రెస్ కాదు…
బీఆర్ఎస్ అవుతుందనే చర్చ బలపడుతోంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా సైలెంట్గా తన గేమ్ ఆడుతోంది.
బీఆర్ఎస్ నుంచి కేడర్ను…
స్థానిక నాయకత్వాన్ని…
గ్రౌండ్ ఓటును తనవైపు తిప్పుకునే ఆపరేషన్ వేగవంతం చేసింది.
అంటే ఇప్పుడు గులాబీ పార్టీపై డబుల్ అటాక్ స్టార్ట్ అయినట్టే.
ఒకవైపు కాంగ్రెస్ “పొలిటికల్ షిఫ్ట్” ప్లాన్ చేస్తుంటే…
మరోవైపు బీజేపీ “లీగల్ అండ్ స్ట్రాటజిక్ ప్రెషర్” పెంచే దిశగా అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
దీంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య సైలెంట్ అవగాహన ఉందనే ప్రచారం…
ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది.
అంటే ఇకపై తెలంగాణలో…
“ఫ్రెండ్లీ ఫైట్” కాదు…
ప్యూర్ పొలిటికల్ బ్యాటిల్ చూడబోతున్నామన్న మాట.
దీంతో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు దాదాపు ఖాయమైపోయింది.
కాంగ్రెస్… బీజేపీ… బీఆర్ఎస్…
మూడు పార్టీలు కూడా ఇప్పుడు “సర్వైవల్ మోడ్”లోకి వెళ్తున్నాయి.
కానీ అసలు ప్రశ్న ఒక్కటే.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎవరు క్యాష్ చేసుకుంటారు..?
బీజేపీ-బీఆర్ఎస్ ఒకరినొకరు దెబ్బతీసుకుంటే లాభం కాంగ్రెస్కేనా..?
లేక… ఈ హై వోల్టేజ్ వార్లో కొత్త రాజకీయ సమీకరణాలు పుడతాయా..?
ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్.
