ప్రత్యేకఅవసరాల పిల్లలకు ఫిజియోథెరపీ వరం ఫిజియోథెరపీ వైద్యులు సిహెచ్ రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల జెడ్పి హెచ్ఎస్ మొగుళ్ళపల్లి భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ఫిజియోథెరపీ క్యాంప్ నిర్వహించారు గౌరవ మండల విద్యాశాఖ అధికారి శ్రీ లింగాల కుమారస్వామి ఆదేశాల మేరకు నిర్వచించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల శారీరక వైకల్యాల పక్షపాతం వంటి సమస్యలు ఉన్నవారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు దివ్యాంగ బాలల బాలికల భవిత కేంద్రంలో ఉచిత విజయోతరపి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దివ్యాంగపిల్లలకు ఆట వస్తువులు బోధన సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది . మండలంలోని వివిధ గ్రామాల వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న బాల బాలికల తల్లిదండ్రులు శిబిరానికి తీసుకువచ్చారు అనంతరం పిల్లలకు ఫిజియోథెరపీ చేసి తల్లిదండ్రులకు సలహాలు సూచనలు ఇచ్చారు భవిత కేంద్రంలో ప్రతి సోమవారం బుధవారం ఫిజియోథెరపీ నిర్వహిస్తారుఈ కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం వెంకన్న ప్రవీణ్ బి సదయ్య చిలుక మారి శ్రీనివాస్ తల్లిదండ్రులు పాల్గొన్నారు
