New RTC Bus Service Launched in Bhupalpally
నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రజల రవాణా ఇబ్బందులను రాకుండా చూడడమే ప్రభుత్వ ఒక్క బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు టేకుమట్ల మండల కేంద్రంలో టేకుమట్ల అంకుషాపూర్ సోమనపల్లి సుబ్బక్కపల్లి నవాబుపేట మొగుళ్లపల్లి పరకాల ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, రైతులు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను పడుతున్నారని నూతనంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు
ఈ కొత్త బస్సు సర్వీసు ద్వారా మారుమూల గ్రామాలకు పట్టణ ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుంది విద్యార్థులకు మేలు సకాలంలో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది ప్రజా సంక్షేమం ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ నాయకులు పాల్గొన్నారు
