Use Government Schemes Effectively: Sarpanch
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్
మొగుళ్లపల్లి ,నేటిధాత్రి:
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తాము పాలకులం కాదని సేవకులం అన్న భావనతో ప్రజల ఆంక్షలు అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా రాష్ట్రమంతా గ్రామ సభలు నిర్వహిస్తున్నాయి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల పైబడి పూర్తి అయిందని రాష్ట్రంలోని ఆర్థిక సవాళ్లు అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు ప్రజాపాలన ప్రణాళికసమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మొగుళ్లపల్లి తహసిల్దార్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూపాలపల్లినియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషి ఎంతగానో ఉందని ప్రజా . ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
ఇందిరమ్మ పాలనలో ప్రజలకు పథకాలు అందుతున్నాయని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు వార్డ్ సభ్యులుఅధికారి, మహిళా సంఘాలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
