SP Dr Shabarish Inspects Kesamudram Polling Centres
ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఐపిఎస్
పటిష్టమైన భద్రతలో కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలు
కేసముద్రం/ నేటి ధాత్రి
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిస్ ఐపీఎస్ కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల కేంద్రాలను సందర్శించారు వారితో పాటు డిఎస్పి తిరుపతిరావు, స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో ముగిసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.
