ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి.
గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్…
30 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వివరాలు ప్రకటన
* నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి*
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఎన్నికల్లో గెలిచిన వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 30 వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్నికల పోటీలో గెలుపొంది రావాలని దానికోసం వార్డు పరిధిలోని నాయకులు కార్యకర్తలు వార్డు ఇన్చార్జిలు కృషి చేయవలసి ఉంటుందని వివరించారు.నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న 30 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.
30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీరే..
1వ వార్డు నుండి మేఘన కొత్తకొండ,2వ వార్డు కంపెల్లి వీణ, 3వ వార్డు నుండి ముత్తినేని వెంకన్న, 4వ వార్డు నుండి బీరం భరత్,5వ వార్డు పొన్నాల మనిషా, 6వ వార్డు నుండి పున్నం నర్సింహారెడ్డి,7వ వార్డు నుండి గంధం నరేందర్,8వ వార్డు నుండి కందుకూరి రజిత,9వ వార్డు అభ్యర్థిగా బండి పల్లవి, 10వ వార్డు నుండి చింతల సాంబరెడ్డి,11 వార్డు నుండి స్వరూప చీకటి,12 వ వార్డు నుండి ఇస్లావత్ రమ,13వ వార్డు నుండి భూక్య మాతృ రాథోడ్,14వ వార్డు నుండి గుజ్జుల భవాని,15వ వార్డు నుండి ఏపూరి శ్రీనివాసరెడ్డి,16వ వార్డు నుండి అజ్మీరా మేఘ్య,17వ వార్డు నుండి సల్లావుద్దీన్ అయోబ్ ఖాన్, 18 వ వార్డు నుండి లక్కర్స్ రజిత,19 వార్డు నుండి ఎలికంటి విజయ్ కుమార్,20 వార్డు నుండి శ్రీరామోజు రోజారాణి, 21 వ వార్డు నుండి అంజలి ఓర్సు,22వ వార్డు నుండి బాణాల ప్రసన్నకుమారి, 23వ వార్డు నుండి వేల్పుల శ్రీలత, 24 వార్డు నుండి బత్తిని రాజేందర్ , 25 వార్డు నుండి పెండెం శ్రీలక్ష్మి, 26వ వార్డు నుండి గాజుల విమల,27వ వార్డు నుండి ములకల వినోద ,28వ వార్డు నుండి చిలువేరు రజిని భారతి , 29వ వార్డు నుండి వేముల సంధ్య,30వ వార్డు నుండి మాదాసి రవిలకు బీఫార్మన్స్ ఇచ్చి పోటీ బరిలో ఉన్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,తోకల శ్రీనివాసరెడ్డి, ఎర్ర యాకూబ్ రెడ్డి,ప్రభాకర్,రాజవీర్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
