Nodal Officer Reviews Students’ Learning Skills at Sataram ZP School
సాతారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను మౌలిక వసతులను పరిశీలించిన నోడల్ ఆఫీసర్
మల్లాపూర్ జనవరి 27 నేటి ధాత్రి
విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కొమ్మిడి లక్ష్మన్న సూచించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతారం లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం మంగళవారం పరిశీలించింది. పాఠశాలలొని మౌలిక వసతులు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం తదితర అంశాలను పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొమ్మిడి లక్ష్మన్న మాట్లాడుతూ విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకత తరగతుల నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేసి ఫలితాల ఆధారంగా గ్రూపులుగా విభజించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాల పెరుగుదలకు ప్రత్యేక చొరవ తీసుకొని ఉపాధ్యాయులు వారిని చదివించాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరీక్షలలో మంచి చేతిరాత నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, వారికి పాఠశాల అంటే ఆసక్తి కలిగేలా బోధన ఉండాలని దాని కొరకు ప్రత్యేక ప్రణాళికలు రచించాలని సూచించారు .పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల రివిజన్ అవుతుందని తెలిపారు
పాఠశాలలో తప్పక ల్యాబ్ నిర్వహించాలని సూచించారు విద్యార్థులు పఠానాస పెంపొందించడానికి గ్రంథాలయ నిర్వహణ కమిటీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు .వారి స్థాయిని బట్టి పుస్తకాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ బృంద సభ్యులు శ్రీనివాసరావు ,దాసరి రామస్వామి, ధర్మేందర్, శ్రీనివాస్ ,శ్రీధర్ ,రవీందర్, సంశుద్దిన్ ,లక్ష్మీనారాయణ నాయక్, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీహరి, ఉపాధ్యాయులు శేషగిరి ,శ్రీనివాస్, చంద్ర ప్రకాష్ ,హరికృష్ణ ,మల్లేశం అర్చన ,హరి శ్రీనిల్ ,ఎండి .కాజా మొయినుద్దీన్ ,డి చంద్రకళ ,గీత ,రాజేంద్రప్రసాద్ ,స్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు
