మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై

వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ వంశీకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పోలీస్ వాహనం లో మహిళను ఎక్కించి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *