మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు ఎస్సై పురుషోత్తం

మహబూబ్ నగర్ జిల్లా: నేటి ధాత్రి 

నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి

డిసెంబర్ 31 న అర్ధరాత్రి వరకు ఎవరైనా మద్యం సేవించి వాహనలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పురుషోత్తం అన్నారు

డిసెంబర్ 31,నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా నవాబుపేట మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని 

ట్రిపుల్ రైడింగ్,హారన్ మోతలు,మితి మీరిన వేగం, 

మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదలకు గురికావద్దన్నారు 

కోవిడ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మా స్కులను ధరించి ,సామాజిక దూరం పాటించాలన్నారు 

అతిగా మద్యం సేవించి ఘర్షణలు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జరిమానాలు,కఠిన చర్యలు తీసుకుంటూ ,కేసులు నమోదుచేస్తామన్నారు 

పర్మిషన్ లేకుండా సమయ పాలన లేకుండా డిజె సౌండ్స్,వాడితే కేసులు నమోదు చేస్తామన్నారు 

ప్రజలు,యువతి ,యువకులు, నూతన సంవత్సర వేడుకలను ఇంటి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు 

 నవాబుపేట మండల పరిధిలోని ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *