మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన,
బిఎస్పి మాజీ మండల అధ్యక్షులు,పిడుగు సుధాకర్.తన సొంత గూటికి చేరుకున్నారు. మాజీమంత్రి వర్యులు& ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గులాబీ కండువా కప్పి బి, ఆర్, ఎస్, పార్టీలో కీ ఆహ్వానించారు. గురువారం రోజు ఎంపీటీసీ ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో మరియు బి, ఆర్, ఎస్, పారీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో పిడుగు సుధాకర్ చేరడం జరిగింది. పిడుగు సుధాకర్ మాట్లాడుతూ,గత తొమ్మిదేళ్లుగా సుస్థిర సుపరిపాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని, అన్నారు. బిఆర్ఎస్, పార్టీ బలపరిచిన.
లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపిద్దాం అని తెలిపారు.