ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

Pyaravaram Bridge Pyaravaram Bridge

ప్యారవరం బ్రిడ్జి పనులు ఎప్పుడో..?

◆ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు రూ.3 కోట్ల మంజూరు శంకుస్థాపనకే పరిమితమా..?

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ప్యారవరం గ్రామ ప్రజల దశాబ్దాల నాటి కల. వంతెన నిర్మాణం ఇంకా కలగానే మిగిలి పోతోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణా నికి గ్రామీణ రహదారుల నిధుల నుంచి రూ.3కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 30న ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జహీరాబాద్ ఎంపీ మాణిక్ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్టా పన చేశారు.

Pyaravaram Bridge
Pyaravaram Bridge


త్వరలో పనులను ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా, పనులను ప్రారం భించడంలో ఎలాంటి కదలిక లేదు. వర్షాకాలం సమీపిస్తుండటంతో వరద నీటి భయంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మళ్లీ బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడనుంది. వంతెన నిర్మాణం పూర్తయితే వరద కష్టాలు తీరుతాయని ఆశగా ఎదురుచూస్తు న్నారు. ప్యాలవరం, దేవరంపల్లి, ఈదులపల్లి,

దిగ్వాల్ గ్రామాల ప్రజల ఆశలు నిరాశగా మారు తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రూ. 3 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవ డంతో ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గం మీదుగా రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వస్తే బ్రిడ్జి కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి కైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన పనులు వెంటనే ప్రారంభించా లని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అగ్రిమెంట్ పూర్తి కాలేదు.

వంతెన నిర్మాణం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ, సంబంధిత గుత్తేదారులతో అగ్రిమెంట్ పూర్తి కాలేదు. మరో ఆరునెలల సమయం పట్టవచ్చు. ఒకవేళ గుత్తేదారులు వెంటనే అగ్రిమెంట్ పూర్తి చేసుకుంటే ప్రారంభ పనులు ప్రారంభిస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!