సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఉత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ భవన్ లోని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా వెన్నంటింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ.. పది రోజులు ఎన్నో పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఈరోజు బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం చేయడం ఎంతో సంతోషకరమని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లవేళలా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ మాట్లాడుతూ ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయమని అట్లాగే సిరిసిల్ల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అంతేకాకుండా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరాలని దేవున్ని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, కుంభాల మల్ రెడ్డి, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు యువకులు తదితరు నాయకులు పాల్గొన్నారు.