బి ఆర్ అంబేద్కర్ కు ఘనమైన నివాళులు
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు కేసముద్రం మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేసముద్రం మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
అనంతరం కేసముద్రం మండలలో అంబేద్కర్ సంఘం భవనం నిర్మాణం కోసం కోటి 50 లక్షలు రూపాయలు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి, ఎమ్మెల్యే మురళి నాయక్ కు ఎంపీ బలరాం నాయక్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం , ఎస్సై మురళీధర్ రాజ్, పిసిసి సభ్యులు దశ్రు నాయక్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,వేముల శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలపాక నాగరాజు,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు, ఎండి అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, దామరకొండ ప్రవీణ్, యాకూబ్, కనుకుల రాంబాబు, మహేందర్, సమ్మయ్య గౌడ్, సామల నరసయ్య, సారయ్య,చేడుపేల్లి ఎలేందర్,అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు వల్లందాస్ రవి, నిల్పుగొండ ఏలియా, మందుల కృష్ణమూర్తి, సోమారపు మదర్, జల్లంపల్లి శ్రీను, జల్లే యాకాబ్రాం,దండు శ్రీను,జలంధర్,ఆనందం, నేరెళ్ల శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.