ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి…

ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు సీతారామయ్య కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణిలో గతం కంటే రాజకీయ జోక్యం ఆర్థిక అరాచకత్వం మితిమీరి పోయిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సాధనకై ఈనెల 18న ప్రారంభమైన సింగరేణి బస్ జాత యాత్ర భూపాలపల్లి జిల్లా కు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య కొరిమి రాజ్ కుమారులు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఈ ప్రభుత్వం అనేక స్ట్రక్చర్ మీటింగులో ఒప్పుకున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అనేక రోజులుగా ఎదురు చూస్తున్న మెడికల్ బోర్డు విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. విజిలెన్స్ కేసుల పరిష్కారం, మెడికల్ ఫిట్ అయిన 300 మందికి పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కోసం మాట ఇచ్చిన యాజమాన్యం అమలు చేయడంలో విఫలమైందని వివరించారు. పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని కోరడం జరిగిందని, డిస్మిస్ కార్మికుల కు మరొకసారి అవకాశం ఇవ్వాలని గుర్తింపు సంఘంగా అడగడం జరిగిందని, అది అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అదేవిధంగా సింగరేణిలో నూతన గనులు రాకుంటే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నూతన గనులు ఏర్పాటు చేయాలని, అనేక కార్మిక సమస్యలపై యాజమాన్యానికి విన్నవించిన వాటిని పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి సేవ్ యాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. 18 నుండి నిర్వహిస్తున్న ఈ యాత్ర 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వంటవార్పు, ముట్టడి, మహా ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈనెల 30 వరకు కార్మిక సమస్యలు పరిష్కారం కాకుంటే అన్ని జాతీయ సంఘాలు ఏకమై మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిర్వహించే నిరసన వంటవార్పు కార్యక్రమానికి భూపాలపల్లి నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీతారామయ్య, రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ సెక్రటరీలు వీరభద్రయ్య, వైవి రావు, ముష్కే సమ్మయ్య,మడ్డి ఎల్లయ్య , ఏ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version