శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల తెలంగాణ రైతురక్షణ సమితి అధ్యక్షునిగా హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన అసాల బాపూరావుని మండల ప్రధాన కార్యదర్శిగా గోవిందాపురం గ్రామానికి చెందిన ఐరబోయిన తిరుపతి ముదిరాజ్ ని నియమిస్తూ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. నియమకానికి సహకరించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావుకి జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు రక్షణ సమితి నాయకులు చౌళ్ల రామారావు, సురావు బాపూరావు, హింగే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.