ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు….
జహీరాబాద్ నేటి ధాత్రి:
పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు..
కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జహీరాబాద్ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో నీలం అభిమానులు బర్తే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకోవడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజు జన్మదిన వేడుకలు ఎన్ఎంఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అనంతరం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులు ఈ కార్యక్రమం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు స్వామి వారి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.
