తోబుట్టువులుగా భావించి… సోదరునిగా కానుకలు…

తోబుట్టువులుగా భావించి… సోదరునిగా కానుకలు

బతుకమ్మ కోలాటాల మహిళలకు చీరల పంపిణీ: చిలువేరు సమ్మయ్య గౌడ్

మండల కేంద్రంలోని 3 గ్రామాలకు 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేసిన సమ్మి గౌడ్

కేసముద్రం/ నేటి దాత్రి

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కోలాటాలు వేయనున్న మహిళలకు సమ్మి గౌడ్ ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ వ్యవస్థాపకులు,కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ చీరలను అందజేశారు..కేసముద్రం మండలంలోని, ఉప్పరపల్లి,అర్పణ పల్లి, అమీనాపురం గ్రామాలకు చెందిన100 మంది కోలాటం మహిళా సోదరీమణులకు ఎసల్ల సత్యనారాయణ, చాగంటి రాము,పబ్బతి సారంగం,మోడెం రాజుహరిణి,ఎర్రంశెట్టి అశోక్ ల ఆధ్వర్యంలో తమకు ఏకరూప చీరలు కావాలని మండల నాయకులు గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత చిలువేరు సమ్మయ్య గౌడ్ ను అడుగగా ఆడబిడ్డలందరికీ అన్నలా అండగా ఉంటానని వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని చీరలను అందజేశారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… ఆడబిడ్డలందరూ తనకు అక్క చెల్లెళ్ళు అని, వారిని తన తోబుట్టువులుగా భావించి అడగగానే చీరలను అందజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని,నా అనేవారికి ఏ విషయంలోనైనా తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, ఆనందం లోనే కాదు ఆపదలో కూడా అండగా ఉంటానని తెలిపారు.ఈ సందర్భంగా కోలాటం మహిళలు మాట్లాడుతూ, అన్న మీ గొప్ప మనసుకు మీ ఔన్నత్యానికి మేము కృతజ్ఞతగా ఉంటామని, ఒక అన్నగా, ప్రతి కుటుంబానికి కొడుకులా మీరు మండల కేంద్రంలో అందిస్తున్న సేవలు మరువలేనివని, మీ ఆశయాలకు మేము ఎల్లవేళలా అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి అశోక్, లక్కాకుల సత్యనారాయణ, ఎసల్ల సత్యనారాయణ,చాగంటి రాము, మోడెం రాజు, పబ్బతి సారంగపాణి, కట్టన్న,విజేందర్ గౌడ్,గంధసిరి వెంకట్,రాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మాతో ఎవరూ సరితూగరు..

మాతో ఎవరూ సరితూగరు..

 

 

డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

చెన్నై: డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, తిరునల్వేలిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ అప్పావుతో కలసి పాల్గొన్న మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ… వేళ్లతో సహా పీకి పారేసేందుకు డీఎంకే చెట్టు కాదని, కోట్లాది మంది ప్రజల మద్దతుతో నాలుగేళ్లకు పైగా సుపరిపాలన అందిస్తుందన్నారు. 15 ఏళ్లుగా తమకు గిట్టని పార్టీల ప్రభుత్వాలను వేళ్లతో పీకేయడమే బీజేపీ పని అని, డీఎంకే గురించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు.

 

అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని, ఇప్పటికి మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా ప్రతి సభలో, సంకీర్ణ ప్రభుత్వమేనని చెబుతున్నారే కానీ, అది ఏ పార్టీ నేతృత్వంలో ఉందో చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌లాగే సీఎం స్టాలిన్‌కు కూడా మహిళల ఆదరణ పెరుగుతోందని, అందువల్ల వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం కాపాడుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version