ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

 ఏం డౌట్ వద్దు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే

 

ఏం డౌట్ అవసరం లేదు.. మళ్లీ వచ్చేది డీఎంకే పాలనే.. అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా ఎంపీ కనిమొళికి అప్పగించానని తెలిపారు. డీఎంకేకు అధికారం ఖాయం అని ఆయన అన్నారు.

ఈ మహానాడులో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ ఈ మహానాడుకు హాజరైన మహిళలను చూస్తూంటే మరోమారు డీఎంకేకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే భావన తనకు కలుగుతోందన్నారు. మహానాడును ఇంత గొప్పగా ఏర్పాట్లు చేపట్టిన తన సోదరి కనిమొళి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రానున్నది మహిళా సంక్షేమ పాలన కనుకనే ప్రస్తుతం డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తయారీ చేసే బాధ్యత కూడా కనిమొళికి అప్పగించానని తెలిపారు. రాష్ట్రంలో పెరియార్‌, అన్నాదురై వంటి మహాపురుషులు మహిళాభ్యుదయం కోసమే తీవ్రంగా పాటుపడ్డారని గుర్తు చేశారు.డీఎంకేకు ముందున్న జస్టీస్‌ పార్టీ తొలి సమావేశం 1914లో జరిగిందని, ఆ సమావేశంలో తొలిసారిగా ఓ మహిళ పాల్గొందని, ఆమే పేరే అలమేలు మంగతాయరమ్మాళ్‌ అని స్టాలిన్‌ తెలి పారు. 1949లో డీఎంకే ఆవిర్భావంలో సత్యవాణి ముత్తు వంటి మహిళా ప్రముఖులు కీలక పాత్ర పోషించారన్నారు. 1956లో అన్నాదురై పార్టీలో మహిళలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆ విభాగానికి మరింత జవసత్వాలు కలిగించారని, అప్పటి నుండి డీఎంకేలో ఈ మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

మాతో ఎవరూ సరితూగరు..

మాతో ఎవరూ సరితూగరు..

 

 

డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

చెన్నై: డీఎంకేతో సరితూగగల పార్టీ ఏదీ లేదని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) కేంద్ర మంత్రి అమిత్‌ షాను ఉద్ధేశించి పేర్కొన్నారు. తిరునల్వేలిలో శుక్రవారం సాయంత్రం జరిగిన బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో అవినీతిని ప్రోత్సహిస్తున్న డీఎంకే ప్రభుత్వాన్ని వేళ్లతో సహా పీకి పారేద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, తిరునల్వేలిలో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ అప్పావుతో కలసి పాల్గొన్న మంత్రి కేఎన్‌ నెహ్రూ మాట్లాడుతూ… వేళ్లతో సహా పీకి పారేసేందుకు డీఎంకే చెట్టు కాదని, కోట్లాది మంది ప్రజల మద్దతుతో నాలుగేళ్లకు పైగా సుపరిపాలన అందిస్తుందన్నారు. 15 ఏళ్లుగా తమకు గిట్టని పార్టీల ప్రభుత్వాలను వేళ్లతో పీకేయడమే బీజేపీ పని అని, డీఎంకే గురించి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమన్నారు.

 

అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఇంకా స్పష్టత రాలేదని, ఇప్పటికి మూడు సార్లు రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా ప్రతి సభలో, సంకీర్ణ ప్రభుత్వమేనని చెబుతున్నారే కానీ, అది ఏ పార్టీ నేతృత్వంలో ఉందో చెప్పకుండా దాటవేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌లాగే సీఎం స్టాలిన్‌కు కూడా మహిళల ఆదరణ పెరుగుతోందని, అందువల్ల వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం కాపాడుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version