దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

దిగ్విజయంగా 180వ వారం అన్నదాన కార్యక్రమం.పాల్గొన్న హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

సమాజం పట్ల బాధ్యతతో, మానవతా దృక్పథంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో గొప్పవని స్థానిక ప్రజలు కొనియాడారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత 180 వారాలుగా కొనసాగుతున్న ఉచిత అన్నదాన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించబడింది.
​ఈ వారం అన్నదాన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు అన్నె అపర్ణ పాల్గొని భక్తులకు, పేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వారం క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హోప్ సభ్యులు తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయమని అన్నారు.
​అత్యధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పటికీ, క్రమశిక్షణతో అందరికీ భోజన వసతి కల్పించడం ఫౌండేషన్ యొక్క అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమావధిగా చైర్మన్ కొండా విజయ్ కుమార్ చేపడుతున్న అనేక ఇతర సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, సభ్యులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన…

ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన

విద్యార్థినిలను సన్మానించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి

 

వనపర్తి నేటిదాత్రి .

 

ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మైనార్టీ విద్యార్థినిలు ఇంటర్ లో మార్కులు సాధించ డము తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారిని శాలువతో సన్మానించారు ఎం.పి.సి మొదటి సంవత్సరంలో అఫ్సా ఖైరన్ 470మార్కులకు 459మార్కులు సాధించింది. ఎం.పి.సి రెండవ సంవత్సరంలో సాయిదా అతియా మహమూది 1000మార్కులకు 916 మార్కులు సాధించింది.సి.ఈ.సి రెండవ సంవత్సరంలో 1000మార్కులకు గాను843 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు చదువులోనే కాకుండా విద్యార్థులు పరిసరాలు,సమాజం ,కుటుంబం పట్ల అవగాహన కల్పించుకొని సమాజ అభివృద్ధికి తోడుపడుతూ పుట్టిన ఊరికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారువిద్యార్థినులకు నిరంజన్ రెడ్డి స్వీట్స్ పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమములో అధ్యాపక బృందం నాజియా బేగం,అబ్దుల్ రెహ్మాన్
నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,బండారు.కృష్ణ,జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్, స్టార్.రహీమ్,అస్లాం,మాధవ్ రెడ్డి, వెంకట్ సాగర్,మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,అలీమ్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం…

ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోడీ ప్రభుత్వం

33 శాతం మహిళా రిజర్వేషన్లు బేషరతుగా అమలు చేయాలి

వరంగల్‌లో ఎంసిపిఐ(యు) నిరసన ర్యాలీ

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి :

దేశ సమైక్యత, సమగ్రతకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగ సవరణలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతోందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును బేషరతుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కమిటీ పిలుపుతో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమం జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అశాస్త్రీయ పద్ధతుల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు రాజ్యాంగ సవరణలకు కేంద్రం తెరలేపిందని ఆరోపించారు.మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా, దాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో అనుసంధానం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా తీసుకొస్తున్న విధానాలపై ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల గౌరవం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా విధానాలు రూపొందించాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి హంసారెడ్డి, నర్ర ప్రతాప్, మాలోత్ సాగర్, కర్ర రాజిరెడ్డి, ముక్కెర రామస్వామి, చుంచు జగదీశ్వర్, మహమ్మద్ మహబూబ్ పాషా, ఎగ్గని మల్లికార్జున్, చీపురు ఓదెలు, మాలి ప్రభాకర్, అప్పనపురి నరసయ్య, బాబు రామస్వామి, జట్టి రాజు, అడపా యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య విజయమే

మహిళల హక్కుల పేరుతో రాజకీయ ఎత్తుగడలు విఫలం

ఏఐఎఫ్బిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ వ్యాఖ్యలు

నర్సంపేట,నేటిధాత్రి:

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని స్వాగతిస్తూ, దీనిని ప్రజాస్వామ్య శక్తుల విజయంగా అభివర్ణించవచ్చని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.నర్సంపేట పట్టణంలోని మార్క్స్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యురాలు జన్ను విజయ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వంగల రాగసుధ మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు వాస్తవానికి మహిళల సాధికారత కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిందని విమర్శించారు.ముఖ్యంగా ఈ బిల్లును నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో అనుసంధానం చేయడం ద్వారా మహిళల హక్కుల అమలులో అనవసరమైన ఆలస్యం సృష్టించబడిందని పేర్కొన్నారు. బిల్లు వీగిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి, మహిళల పేరుతో చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బహిర్గతమయ్యాయని అన్నారు.
దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న హింస, అసమానతలు, ఆర్థిక సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో మహిళలకు తక్షణ రాజకీయ ప్రతినిధిత్వం అవసరమని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం వాగ్దానాలు చేస్తూ వాటిని అమలు చేయడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ను ఎటువంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రక్రియలతో మహిళా హక్కులను అనుసంధానం చేయకూడదని, మహిళల సాధికారతకు స్పష్టమైన కాలపరిమితి గల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు.మహిళల పేరుతో రాజకీయ లాభాలు పొందే ప్రయత్నాలను దేశ మహిళలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా మహిళల పక్షాన ఉందని నిరూపించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి ఆందోళనలు, పోరాటాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు మైదం పద్మ, గణిపాక బిందు, బెజ్జంకి పుష్ప, కాకి కోమల, పిట్టల పద్మ, లక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version