ఇంటర్మీడియట్ లో ప్రతిభ చూపిన
విద్యార్థినిలను సన్మానించిన మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి
వనపర్తి నేటిదాత్రి .
ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల మైనార్టీ విద్యార్థినిలు ఇంటర్ లో మార్కులు సాధించ డము తో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారిని శాలువతో సన్మానించారు ఎం.పి.సి మొదటి సంవత్సరంలో అఫ్సా ఖైరన్ 470మార్కులకు 459మార్కులు సాధించింది. ఎం.పి.సి రెండవ సంవత్సరంలో సాయిదా అతియా మహమూది 1000మార్కులకు 916 మార్కులు సాధించింది.సి.ఈ.సి రెండవ సంవత్సరంలో 1000మార్కులకు గాను843 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు చదువులోనే కాకుండా విద్యార్థులు పరిసరాలు,సమాజం ,కుటుంబం పట్ల అవగాహన కల్పించుకొని సమాజ అభివృద్ధికి తోడుపడుతూ పుట్టిన ఊరికి,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారువిద్యార్థినులకు నిరంజన్ రెడ్డి స్వీట్స్ పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమములో అధ్యాపక బృందం నాజియా బేగం,అబ్దుల్ రెహ్మాన్
నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,కె.మాణిక్యం,బండారు.కృష్ణ,జోహెబ్ హుస్సేన్,సయ్యద్.జమీల్, స్టార్.రహీమ్,అస్లాం,మాధవ్ రెడ్డి, వెంకట్ సాగర్,మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,అలీమ్,తోట.శ్రీను తదితరులు ఉన్నారు.
