కరీంనగర్ పాల డేయిరి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత….

కరీంనగర్ పాల డేయిరి ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు అందజేత….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలో. పెళ్లి జరుగుతున్న కుటుంబానికి పుస్తె.మట్టలు అందజేసిన. అందజేసిన కరీంనగర్ డేయిరిపాలకేంద్రం. ఈ సందర్భంగా. నేరెళ్ల రూట్ సూపర్వైజర్ ఉమ్మారెడ్డి భానుచందర్ రెడ్డి మాట్లాడుతూ. కరీంనగర్ పాల డైరీ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగానే కళ్యాణమస్తు పథకం చేపట్టిందని దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం దేశాయి పల్లె గ్రామంలోని పాడి రైతు పెండ్యాల దేవి రెడ్డి. జయ.ల కూతురు. రమ్య వివాహానికి. ఆడబిడ్డ పెళ్లికి కరీంనగర్.డేయిరీ. పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పుస్తె మట్టలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. దేశాయి పల్లె పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు గట్టు లక్ష్మారెడ్డి. డైరెక్టర్లు మరియు సెక్రటరీ గోపన్న గారి హరీష్. కుటుంబ సభ్యులు పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత…

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

జహీరాబాద్ నేతి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, హుగ్గేల్లీ గ్రామానికి చెందిన మర్పల్లి గొల్ల యాదమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె పూజ (శిరీష) వివాహం బుధవారం దిగ్వాల్లోని నేషనల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హుగ్గేల్లీ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా వధువు కుటుంబానికి వివాహ కానుకగా ₹11,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version