‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత…

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

జహీరాబాద్ నేతి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, హుగ్గేల్లీ గ్రామానికి చెందిన మర్పల్లి గొల్ల యాదమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె పూజ (శిరీష) వివాహం బుధవారం దిగ్వాల్లోని నేషనల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హుగ్గేల్లీ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా వధువు కుటుంబానికి వివాహ కానుకగా ₹11,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version