భద్రకాళి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి ప్రత్యేక పూజలు

భద్రకాళి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి ప్రత్యేక పూజలు.

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం గర్భగుడిలో శ్రీ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
పూజానంతరం ఆలయ మండపంలో ముఖ్య అర్చకులు, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములను అన్నా లెజ్నెవాకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలి…

నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో నిర్వహించిన నామినేషన్ల ఉపసంహరణ,అభ్యర్థుల తుది జాబితా తయారీ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ సంపత్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ల ఉపసంహరణ పకడ్బందీగా చేపట్టాలని,నిర్దేశిత సమయంలోగా ప్రక్రియ పూర్తి చేసి నిబంధనల ప్రకారం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాలని అధికారులకు సూచించారు.నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సి సి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల ప్రక్రియ పూర్తిగా వీడియోగ్రఫీ చేయడం జరిగిందని తెలిపారు.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్,12వ తేదీన రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.08736-250501 ఏర్పాటు చేయడం జరిగిందని,ఎన్నికల సంబంధించిన సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై ఫిర్యాదుల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం,ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులను సందర్శించి వంటశాల,ఇతర పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు.తదనంతరం కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.పాఠశాలలు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని,వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.పాఠశాలకు మంజూరైన భోజనశాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.మండలంలోని రేగులగూడ గ్రామంలో గల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి పాఠశాలకు మంజూరైన అదనపు గదుల నిర్మాణ ప్రక్రియను పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి…

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీరు మద్యం దుకాణాలు బందు చేయిoచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
2 విడత ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఐదు మండలాల పరిధిలో సాయంత్రం 5:00 గంటల గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని కోరారు ఆ తర్వాత ఎటువంటి బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఇతర ప్రాంతల వారు ఉంటే వెళ్లిపోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు

జగన్ కంచుకోటకు బీటలు..

 

జగన్ కంచుకోటకు బీటలు.. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్‌ జగన్‌ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు.

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కంచుకోటకు బీటలు వారాయి. పులివెందుల బైపోల్‌ జగన్‌ నాయకత్వానికి గొడ్డలిపెట్టు అయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (Pulivendula ZPTC BYE Election) తెలుగుదేశం పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Latha Reddy) 6,735 ఓట్లతో ఘన విజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలిచారు. లతారెడ్డి గెలుపుతో పులివెందులలో వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి (Hemanth Reddy) డిపాజిట్ కోల్పోయారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు. లతారెడ్డి గెలుపుతో పసుపు సైనికులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి లతారెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. లతారెడ్డి గెలుపుతో పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

మరోవైపు.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కడప పాలిటెక్నిక్ కాలేజ్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. పులివెందుల, ఒంటిమిట్ట బరిలో 11 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పులివెందులలో 74శాతం, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

కడప పాలిటెక్నిక్ కళాశాలలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఒకే రౌండ్‌లో పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి అయింది. పులివెందుల జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్‌కు పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో ఒంటిమిట్ట జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తిఅయింది. ఒక్కో టేబుల్‌పై 1,000 ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని ఆరోపిస్తూ కౌంటింగ్‌‌ను వైసీపీ నేతలు బహిష్కరించిన విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version