భద్రకాళి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి ప్రత్యేక పూజలు

భద్రకాళి ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి ప్రత్యేక పూజలు.

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం గర్భగుడిలో శ్రీ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి.
పూజానంతరం ఆలయ మండపంలో ముఖ్య అర్చకులు, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములను అన్నా లెజ్నెవాకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version