సర్పంచ్ ఓట్ల లెక్కింపు వరకు బీరు షాపులు బందు చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బీరు మద్యం దుకాణాలు బందు చేయిoచాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.
2 విడత ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఐదు మండలాల పరిధిలో సాయంత్రం 5:00 గంటల గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని కోరారు ఆ తర్వాత ఎటువంటి బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఇతర ప్రాంతల వారు ఉంటే వెళ్లిపోవాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరారు పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు
