“మెట్‌పల్లి రైతుల ఆందోళన: అక్రమ మోరంపై చర్యలు కోరింత”…

మెట్ పల్లి

ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

మెట్ పల్లి పట్టణ రైతులు ఆర్డీవో కి అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు అనంతరం రైతులు మాట్లాడుతూ పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంట లో ఉన్న మా పొలాల తోవలో గుండు గుట్టలను నిత్యం జెసిబి లతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు నాలుగు జెసిబి లు 20 పైగా ట్రాక్టర్లతో మొరము తరలిస్తూ ఉన్నారు .
ఈ అక్రమ మోరం తీసుకెళ్లేటప్పుడు అతివేగంగా రావడం రాత్రింబవళ్లు లో కూడా ట్రాక్టర్లు తిరగడం పంట పొలాలు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అంతేకాకుండా అనుభవం లేని లైసెన్స్ లేని డ్రైవర్లతో వంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం దీని ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని ఇంతకుముందు తహసిల్దార్ కి మొరము తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని మొరం డిమాండ్ ఎక్కువ ఉండడంతో జెసిపిల ద్వారా గుండు గుట్ట నుండి తీసుకొచ్చి డ్రంపులు చేస్తూ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని ప్రస్తుతం గుండు గుట్ట కనుమరుగవుతూ ఉన్నదని అధికారులు మాకేం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నారని మేము పంట పొలాలకు వెళ్లి కెనాల్ దారిలో అక్కడి కాలనీవాసులు కెనాల్ వెంట సిసి రోడ్డుపై జెసిబి లు ట్రాక్టర్లు మిల్లర్లు కార్లు అన్ని రోడ్లపై నిలుపుతున్నారని బండ్లను తీయమంటే వారు బెదిరిస్తూ భయంతో గురి చేస్తున్నారని దయచేసి మా యందు దయతలిచి మా సమస్యలకు వెంటనే పరిష్కరించాలని అక్రమ మొరంపై చర్యలు తీసుకోవాలని కెనాల్ వెంట సిసి రోడ్డుపై ఉన్న వెహికల్స్ తీయించి మాకు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చామని అన్నారు .ఈ కార్యక్రమంలో జెట్టి లింగం ఒజ్జల బుచ్చిరెడ్డి ఎర్రోళ్ల హనుమాన్లు ఆకుల నరేష్ నారాయణ బొడ్ల ఆనందు ఒజ్జల శ్రీనివాస్ కురుమ సాయిలు లక్ష్మణ్ యమ రాజయ్య అరిగేలా లక్ష్మణ్ జెట్టి శ్రీనివాస్ బాలరాజు సంజీవ్ గంగారెడ్డి సురేష్ దేవయ్య తదితర రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version