తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు..

తాటికాయల సత్తెమ్మ గారి పార్థివ దేహానికి పూలమాల నివాళులు

అర్పించిన…కట్రియాల ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్ & టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య & మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్ & ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలోని, కట్రీయాల గ్రామములో ఇందిరమ్మ కమిటీ సభ్యులు తాటికాయాల కుమారస్వామి గారి మాతృమూర్తి తాటికాయల సత్తెమ్మ గారు మరణించడం జరిగింది .కనుక ఇట్టి విషయం వర్ధన్నపేట శాసన సభ్యులు కే. ఆర్.నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. భౌతిక దేహాన్ని సందర్శించండి అని ఆదేశించడంతో , కుమారస్వామి గారి నివాసం వద్దకు గ్రామ ఉప సర్పంచ్ నాంపెల్లి రవీందర్,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య టెంపుల్ చైర్మన్ కట్ట వెంకటయ్య, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండి అక్బర్ లు చేరుకొని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమములో 7 వ వార్డు సభ్యులు ఎలికట్టే చిన్న రాజు, కాంగ్రెస్ యువ నాయకులు కొండ్రతి సంతోష్,ఇరుకు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు..

ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సిద్ధాపుర్ తండా గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు నూతనంగా గెలుపొందిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.వారికి ఎమ్మెల్యే మాణిక్ రావు పూల మాల వేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version